బెజవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి కారులో మద్యం

Siva Kodati |  
Published : Sep 30, 2020, 05:18 PM ISTUpdated : Sep 30, 2020, 05:34 PM IST
బెజవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి కారులో మద్యం

సారాంశం

విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి కారులో అక్రమ మద్యం పట్టుబడింది. జగ్గయ్యపేటకు చెందిన చక్కా వెంకట నాగవరలక్ష్మీ కారులో భారీగా మద్యం వుందని పోలీసులకు సమాచారం అందింది

విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి కారులో అక్రమ మద్యం పట్టుబడింది. జగ్గయ్యపేటకు చెందిన చక్కా వెంకట నాగవరలక్ష్మీ కారులో భారీగా మద్యం వుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

 ఈ క్రమంలో జగ్గయ్యపేట సీతారాంపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పార్క్‌ ఏపీ 16 బీవీ 5577 అనే నెంబర్ గల స్విఫ్ట్ కారులో అధికారులు మద్యం స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.

అయితే ఈ వ్యవహారం ఏపీ  రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఇప్పటి వరకు వరలక్ష్మీ భర్త, కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన మద్యం తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని విలువ రూ. 40 వేలు ఉంటుందని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్