ఐబీ సిలబస్‌.. విద్యార్థులంద‌రికీ నాణ్యమైన అంతర్జాతీయ విద్యను అందిస్తాం.. : బొత్స సత్యనారాయణ

Published : Oct 21, 2023, 05:37 AM IST
ఐబీ సిలబస్‌.. విద్యార్థులంద‌రికీ నాణ్యమైన అంతర్జాతీయ విద్యను అందిస్తాం.. : బొత్స సత్యనారాయణ

సారాంశం

Vijayawada: ఐబీ సిలబస్ వల్ల ఏపీలోని అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన అంతర్జాతీయ విద్య సమానంగా లభిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఐబీని ఐదేళ్లలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం రూ.149 కోట్లు ఖర్చు చేస్తుందనీ, కార్పొరేట్ సంస్థల్లోని ప్రత్యర్థులతో పోటీ పడేలా వారిని సన్నద్ధం చేయడమే లక్ష్యమని బొత్స సత్యనారాయణ తెలిపారు.  

Education Minister Botsa Satyanarayana: ఐబీ (ఇంటర్నేషనల్ బ్యాకలారియాట్) సిలబస్ వల్ల ఏపీలోని అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన అంతర్జాతీయ విద్య సమానంగా లభిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఐబీని ఐదేళ్లలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం రూ.149 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తుందని, కార్పొరేట్ సంస్థల్లోని ప్రత్యర్థులతో పోటీ పడేలా వారిని సన్నద్ధం చేయడమే లక్ష్యమని బొత్స సత్యనారాయణ తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. రాష్ట్రంలోని విద్యారంగంలో అనేక మార్పులు తీసుకువ‌స్తున్నామ‌నీ, విద్యార్థులంద‌రికీ నాణ్య‌మైన విద్యాను అందించ‌డానికి తమ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్య‌నారాయ‌ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బ్యాకలారియాట్ (ఐబి) పాఠ్యాంశాలను అమలు చేయడంతో అన్ని వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో సమానమైన విద్య అందుతుంద‌నీ, ప్ర‌భుత్వం ల‌క్ష్యం కూడా ఇదేన‌ని మంత్రి వివ‌రించారు. సమగ్ర శిక్షా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బొత్స‌ సత్యనారాయణ, ఐదేళ్ల కాలంలో విద్యార్థుల పరిధిలోకి ఐబీని తీసుకురావడానికి రాష్ట్రం కేవలం ₹149 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.

ఇతర రాష్ట్రాల్లో కాకుండా, ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే ఐబీ సిలబస్ అమలు చేయబడుతోందని పేర్కొన్న మంత్రి.. ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు సమిష్టిగా పాఠ్యాంశాలను అమలు చేయడానికి ముందు ఐబీ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామ‌నీ, విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ఒక సంస్థ ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం విద్య కోసం వెచ్చించే ప్రతి రూపాయి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు వరంగా మారుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా పోటీపడేలా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు.

విద్యార్ధులు తమ విద్యా, భవిష్యత్తు కెరీర్‌లలో ప్రకాశించేలా సౌకర్యాలను పెంచాల‌నీ, వారికి సరైన వేదికను అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టిందని మంత్రి వివ‌రించారు. 3వ తరగతి నుండి ఇంగ్లీషు పరీక్షను విదేశీ భాషగా (TOEFL) ప్రవేశపెట్టడం, 8వ తరగతి విద్యార్థులకు బైజూ కంటెంట్‌తో ముందే లోడ్ చేయబడిన ట్యాబ్‌ల పంపిణీ చేయ‌డం, తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలు-ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌ల (IFPలు) ఇన్‌స్టాలేషన్ వంటి విష‌యాలు ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడే నిర్ణయాలుగా ఉన్నాయ‌ని చెప్పారు. పూర్తి పారదర్శకతను కొనసాగించడం ఎల్లప్పుడూ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్న బొత్స సత్యనారాయణ..నిరాధారమైన ఆరోపణలతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్న కొన్ని శక్తుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AP Minister Ramprasad Reddy Lays Foundation for ₹19 Crore Works in Vijayawada | Asianet News Telugu
APCPDCL హెడ్ఆఫీస్ప్రారంభంలోMinister Gottipati Ravi Kumar | APCPDCL Head Office | Asianet News Telugu