కడప స్టీల్ ఫ్యాక్టరీకి డిసెంబర్ 26న శంకుస్థాపన: జగన్

Published : Jul 08, 2019, 03:18 PM IST
కడప స్టీల్ ఫ్యాక్టరీకి డిసెంబర్ 26న శంకుస్థాపన: జగన్

సారాంశం

ఈ ఏడాది డిసెంబర్ 26వ తేదీన కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని ఏపీ సీఎం  వైఎస్ జగన్ చెప్పారు. మూడేళ్లలో ఫ్యాక్టరీ పనులు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.  

జమ్మలమడుగు: ఈ ఏడాది డిసెంబర్ 26వ తేదీన కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని ఏపీ సీఎం  వైఎస్ జగన్ చెప్పారు. మూడేళ్లలో ఫ్యాక్టరీ పనులు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
 
  సోమవారం నాడు జమ్మలమడుగులో రైతు దినోత్సవ కార్యక్రమంలో  జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో  కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో డ్రామాలు ఆడారని ఆయన విమర్శలు చేశారు.

ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైతే సుమారు 20వేల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉందన్నారు.  జిల్లాలోని ప్రాజెక్టులకు నీరందేలా చర్యలు తీసుకొంటామన్నారు. మరో వైపు జమ్మలమడుగులోని చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను  అమలు చేస్తామని  ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యేలే మార్కెట్ కమిటీ గౌరవ చైర్మెన్లు: జగన్

ఈసారి ఓటేయని వాళ్లు కూడ ఓటేసేలా పనులు: జగన్

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu