రాజమండ్రి : అమరావతి రైతులపై చెప్పులు విసిరిన వైసీపీ శ్రేణులు.. ఎంపీ మార్గాని భరత్ కనుసన్నల్లోనే ..?

By Siva KodatiFirst Published Oct 18, 2022, 2:30 PM IST
Highlights

ప్రస్తుతం అమరావతి రైతుల పాదయాత్ర రాజమండ్రి నగరం మీదుగా సాగుతోంది. ఈ  క్రమంలో అమరావతి రైతులపై మంగళవారం కొందరు వ్యక్తులు చెప్పులు, వాటర్ బాటిల్స్‌ను విసిరారు. వీరంతా వైసీపీ మద్ధతుదారులుగా తెలుస్తోంది. 

అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా వుండాలనే ఉద్దేశ్యంతో రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు ప్రస్తుతం ఆటంకాలు ఏర్పడుతోన్న సంగతి తెలిసిందే. కృష్ణా, గుంటూరు జిల్లాలను దాటి ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి యాత్ర ప్రవేశించిందో నాటి నుంచి పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం రైతుల పాదయాత్ర రాజమండ్రి నగరం మీదుగా సాగుతోంది. ఈ క్రమంలో అమరావతి రైతులపై మంగళవారం కొందరు వ్యక్తులు చెప్పులు, వాటర్ బాటిల్స్‌ను విసిరారు. వీరంతా వైసీపీ మద్ధతుదారులుగా తెలుస్తోంది. ఆ పార్టీ ఎంపీ మార్గాని భరత్ కనుసన్నల్లోనే ఇది జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు రైతుల పాదయాత్రలోకి మార్గాని భరత్ దూసుకొచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. అమరావతి రైతులు, వైసీపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ... అన్నదాతలకు మద్ధతుగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు నిలిచాయి. 

ALso REad:మూడు రాజధానులు.. నిడదవోలులో అమరావతి రైతులను అడ్డుకున్న జేఏసీ నేతలు, ఉద్రిక్తత

Latest Videos

ఇకపోతే.. గతవారం తూర్పుగోదావరి జిల్లా నిదడవోలులోనూ ఇదే రకమైన పరిస్ధితి నెలకొంది. స్థానిక ఓవర్‌బ్రిడ్జి పోటాపోటీ నినాదాలతో హోరెత్తింది. అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రకు వ్యతిరేకంగా జేఏసీ నేతలు ఉదయం నుంచి నల్ల బెలూన్లు ఎగురవేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్ర కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. అమరావతికి రైతులు ఆకుపచ్చ కండువాలు ఎగురేస్తుండగా.. జేఏసీ నేతలు నల్ల కండువాలు ఎగురవేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు, ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు నేతలు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు పరిస్ధితిని అదుపు చేశారు. 

click me!