విశాఖపట్టణం పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం: నలుగురు కార్మికులు మృతి

By narsimha lodeFirst Published Dec 26, 2022, 9:17 PM IST
Highlights

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా  పరవాడ  ఫార్మాసిటీలో  సోమవారం నాడు  జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు  కార్మికులు  మృతి చెందారు.మ రొకరు గాయపడ్డారు. 

విశాఖపట్టణం: ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా  పరవాడ ఫార్మాసిటీలో  సోమవారంనాడు అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా  ఉంది.పరవాడ ఫార్మాసిటీలోని  లారస్  యూనిట్ -3 లో  షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి.  ఈ మంటల్లో చిక్కుకుని ఐదుగురు కార్మికులు  గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం  ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  నలుగురు కార్మికులు మృతి చెందారు. మరొకరి  పరిస్థితి  విషమంగా  ఉందని వైద్యులు  ప్రకటించారు. 

ఈ ప్రమాదంలో  మృతి చెందిన  కార్మికుల మృతదేహలను  కేజీహెచ్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.ఖమ్మం జిల్లాకు చెందిన  బి. రాంబాబు, గుంటూరు జిల్లాకు రాజేష్ బాబు , రంగారెడ్డి జిల్లాకు సతీష్ , కోటపాడుకు చెందిన రామకృష్ణ,చోడవరం కు వెంకటరావులు ప్రమాదం జరిగిన ప్రదేశంలో పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా  గా పడ్డారు. వారిని  ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  నలుగురు మృతి చెందారు. మరొకరు  ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.    

click me!