ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ ఎలా.. జగన్ సర్కార్ తర్జనభర్జనలు, రేపు క్లారిటీ

Siva Kodati |  
Published : Feb 18, 2023, 06:25 PM IST
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ ఎలా.. జగన్ సర్కార్ తర్జనభర్జనలు, రేపు క్లారిటీ

సారాంశం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది . 13 రోజుల బడ్జెట్ సమావేశాలపై రేపు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం వుంది.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఈ నెల 27నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అదే రోజు గవర్నర్ ప్రసంగం వుండే అవకాశం కనిపిస్తోంది. మళ్లీ మార్చి 6 నుంచి సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది ఏపీ ప్రభుత్వం. 13 రోజుల బడ్జెట్ సమావేశాలపై రేపు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం వుంది. మార్చి 3 , 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌కు ఇబ్బందులు లేకుండా వుండేందుకు మార్చి 1 నుంచి 5 వరకు అసెంబ్లీ సమావేశాలకు విరామం ఇవ్వనుంది ప్రభుత్వం. కొత్త గవర్నర్ బాధ్యతలు చేపట్టాక బడ్జెట్ సమావేశాలపై క్లారిటీ ఇవ్వనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

తెలుగు ప్రజలారా బిఅలర్ట్..ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుల ప్రమాదం | Asianet News Telugu
Rain Alert : తెలుగు ప్రజలారా బిఅలర్ట్.. పిడుగులు, ఈదురుగాలుల వర్షాలతో ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం