శివరాత్రి వేళ పట్టిసీమ వద్ద విషాదం.. గోదావరి నదిలో ముగ్గురు గల్లంతు..

Published : Feb 18, 2023, 05:16 PM IST
శివరాత్రి వేళ పట్టిసీమ వద్ద విషాదం.. గోదావరి నదిలో ముగ్గురు గల్లంతు..

సారాంశం

ఏలూరు జిల్లా పట్టిసీమలో మహాశివరాత్రి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. శివరాత్రి వేళ గోదావరి నదిలో పుణ్యస్నానం చేసేందుకు దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.

ఏలూరు జిల్లా పట్టిసీమలో మహాశివరాత్రి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. శివరాత్రి వేళ గోదావరి నదిలో పుణ్యస్నానం చేసేందుకు దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన ముగ్గురు యువకులు శివరాత్రి సందర్భంగా పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఉత్సవాలను చూసేందుకు వచ్చారు. అయితే గోదావరి నదిలో స్నానానికి దిగిన సమయంలో  నది ప్రవాహానికి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైనవారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Kadapa Steel Plant: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మ‌రో ముంద‌డుగు.. 3,500 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడి
Nara Lokesh Emotional: చిన్నప్పుడే నాన్న చనిపోయారు..ఈ విద్యార్థిని కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు