డొల్ల కంపెనీలతో కోట్ల రూపాయ‌లు స్వాహా చేశారు.. చంద్ర‌బాబుపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఫైర్

Published : Oct 31, 2023, 03:32 AM IST
డొల్ల కంపెనీలతో కోట్ల రూపాయ‌లు స్వాహా చేశారు.. చంద్ర‌బాబుపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఫైర్

సారాంశం

Visakhapatnam: రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని  ఆంధ్ర ప్ర‌దేశ్  ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సాక్ష్యాధారాలు లేవంటూ లోకేష్ హల్ చల్ చేస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. ఆధారాలు సేక‌రించిన త‌ర్వ‌తే చంద్రబాబు అరెస్టు జ‌రిగింద‌ని పేర్కొన్నారు.  

AP IT and Industries Minister Gudivada Amarnath: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సాక్ష్యాధారాలతో పట్టుబడి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జైలుకు వెళ్లారని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌పై 15 చోట్ల సంతకాలు చేశారనీ, ఆ వివరాలను రాష్ట్ర అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ  ఇదివ‌ర‌కు వెల్లడించిందని తెలిపారు. డొల్ల కంపెనీలను సృష్టించి చంద్ర‌బాబు నాయుడు తన జూబ్లీహిల్స్ నివాసానికి కోట్లాది రూపాయలను బదిలీ చేశారని అమర్‌నాథ్ ఆరోపించారు. ఆయ‌న 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం ఇలాంటి వ్యవస్థల నిర్వహణకే గడిచిందని మంత్రి ఆరోపించారు.

నారా లోకేశ్ తీరుపై కూడా మంత్రి మండిప‌డ్డారు. త‌న తండ్రి ప్రాణాలకు ముప్పు ఉందంటూ లోకేష్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్ర‌బాబు ఇంటి కంటే మెరుగైన రీతిలో చికిత్స పొందుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఒక కేసులో సాక్ష్యాలను కోర్టుకు సమర్పిస్తామనీ, నిందితులకు కాదని చుర‌క‌లంటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం వెనుక గల కారణాన్ని లోకేశ్ బయటపెట్టాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబు నాయుడు క్షేమంగా ఉన్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ గురించి మంత్రి ప్రస్తావిస్తూ, యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు. బస్సుయాత్రపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు.

ఇదిలావుండ‌గా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది . మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై మంగళవారం నిర్ణయం వెలువడే అవకాశం ఉండగా, ప్రధాన బెయిల్ పిటిషన్‌పై వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోబడతాయి. ఇక కౌశల్ కేసులో బెయిల్ అభ్యర్థనను ఏసీబీ కోర్టు తిరస్కరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu