జడ్జిలపై అభ్యంతరకర వ్యాఖ్యలు: ఏపీ హైకోర్టుకు స్టేటస్ రిపోర్ట్ సమర్పించిన సీబీఐ

By narsimha lodeFirst Published Oct 6, 2021, 2:57 PM IST
Highlights

జడ్జిలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సు సీబీఐ అధికారులు బుధవారం నాడు ఏపీ హైకోర్టుకు అందించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను  అరెస్ట్ చేశామని సీబీఐ అధికారులు ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు.

అమరావతి: జడ్జిలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సీబీఐ అధికారులు బుధవారం నాడు ఏపీ హైకోర్టుకు సమర్పించారు.ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.

also read:జడ్జిలపై అభ్యంతర వ్యాఖ్యలు: మరో ఛార్జీషీట్ దాఖలు చేసిన సీబీఐ

విదేశాల్లో ఉంటున్న నిందితుల అరెస్ట్ కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారని  హైకోర్టు ప్రశ్నించింది. ఇతర ఏజెన్సీల సహాయంతో  నిందితుల అరెస్ట్ కు ప్రయత్నిస్తున్నామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. ఈ కేసు విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.

జడ్జిలకు, న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ap high courtలో  గత ఏడాది పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది హైకోర్టు. ఈ అంశంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ 2020 అక్టోబర్ 8వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. 

CBI విచారణకు ముందు ఈ కేసును ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. ap cid  విచారణ సక్రమంగా లేదని  భావించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో సీఐడీ అధికారుల విచారణకు సంబంధించిన సమాచారాన్ని కూడ సీబీఐ అధికారులు సేకరించారు. 

ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో సీబీఐ నలుగురిపై వేర్వేరుగా ఛార్జీషీట్లను దాఖలు చేసింది. ఆదర్శ్ రెడ్డి, కొండారెడ్డి, సాంబశివారెడ్డి,సుధీర్  లపై అభియోగాలను మోపింది. వీరిని ఈ ఏడాది జూలై, ఆగస్టు 7 తేదీల్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


 

click me!