ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధకారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై స్టేఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. ఈ కేసు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
అమరావతి: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై విచారణను క్యాట్ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. దేశ ద్రోహానిికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఐపఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ రాత్రి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనను సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈ నెల 13వ తేదీన క్యాట్ను ఆశ్రయించారు. ఈ పిటిషన్పై శుక్రవారం నాడు విచారణ జరిగింది. సస్పెన్షన్ చట్ట విరుద్దమని ప్రకటించాలని క్యాట్ను ఏబీ వెంకటేశ్వరరావు కోరారు.
Also read:రాజకీయ ఒత్తిళ్ల వల్లనే...: క్యాట్ ను ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వర రావు
సస్పెన్షన్పై స్టే విధించాలని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ను కోరారు. అయితే స్టే విధించేందుకు మాత్రం క్యాట్ అంగీకరించలేదు. ఈ కేసు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
ఏపీ ప్రభుత్వం తరపున దేశాయి ప్రకాష్ రెడ్డి ఈ పిటిషన్పై వాదించారు. డీజీపీ స్థాయి అధికారిని కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ఎలా సస్పెండ్ చేశారని క్యాట్ ప్రశ్నించింది.
ఈ విషయమై తమకు వారం రోజుల పాటు సమయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది క్యాట్ను కోరారు. 2019 మే నెల నుండి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎందుకు జీతం ఇవ్వలేదో చెప్పాలని క్యాట్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.