కరోనా ప్రభావం తగ్గాక విశాఖకు రాజధాని తరలింపు: మంత్రి పెద్దిరెడ్డి

Published : Jul 31, 2020, 05:13 PM IST
కరోనా ప్రభావం తగ్గాక విశాఖకు రాజధాని తరలింపు: మంత్రి పెద్దిరెడ్డి

సారాంశం

 కరోనా ప్రభావం తగ్గిన తర్వాత విశాఖకు రాజధాని తరలించే పనులు జరుగుతాయని ఏపీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.

చిత్తూరు: కరోనా ప్రభావం తగ్గిన తర్వాత విశాఖకు రాజధాని తరలించే పనులు జరుగుతాయని ఏపీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.

also read:జగన్ కు జోష్, చంద్రబాబుకు షాక్: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం

శుక్రవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మంత్రి మాట్లాడారు. చంద్రబాబుతో పాటు ఆయన మిత్రులు సీఆర్ డీఏను అడ్డు పెట్టుకొని రియల్ ఏస్టేట్ వ్యాపారం చేశారని ఆయన ఆరోపించారు. దీంతో వేలాది కోట్లు లబ్దిపొందేందుకు ప్రయత్నించారని ఆయన విమర్శించారు.

also read:పంతం నెగ్గించుకొన్న జగన్: మూడు రాజధానులపై బాబు ఏం చేస్తారు

రెండు బిల్లులను గవర్నర్ ఆమోదించడంతో చంద్రబాబుకు తీవ్రమైన బాధ కలుగుతోందని ఆయన సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం దోహదపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

మూడు రాజధానులను టీడీపీ సహా అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. బీజేపీ కూడ అమరావతికే మద్దతు పలికింది.మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రాజధానుల ఏర్పాటు ఇక లాంఛనమే కానుంది.

PREV
click me!

Recommended Stories

Smart Kitchen Project for Schools | CM Appreciates Kadapa District Collector | Asianet News Telugu
Roop Kumar Yadav Serious Comments Anil Kumar Yadav | Nellore Political Heat | Asianet News Telugu