ఢిల్లీలో విపక్షాల భేటీ... ఏ కూటమిలో వైసీపీ చేరదు: బొత్స

By sivanagaprasad kodatiFirst Published Dec 10, 2018, 1:33 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ ఎన్నికల ప్రభావం ఉండదన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ ఎన్నికల ప్రభావం ఉండదన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు.

సీఎంపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందన్నారు.  రాబయే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమిని ఎవరూ అడ్డుకోలేరని బొత్స వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఏర్పడే ఏ కొత్త కూటమిలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ చేరదని బొత్స స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఏర్పడుతున్న కూటమిని కూడా ..చంద్రబాబు తన అవసరాల కోసమే వాడుకుంటున్నారని సత్యనారాయణ విమర్శించారు.

 

రేపు ఢిల్లీకి బాబు: బీజేపీయేతర పార్టీలతో కీలక భేటీ

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ రెడీ

తెలంగాణ ఎన్నికలు: కేసీఆర్ గెలిస్తే చంద్రబాబుకు గడ్డుకాలమే

click me!