నిజమే... జగన్ కు సవాల్ విసిరే స్థాయి లోకేష్ ది కాదు: అయ్యన్న సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : Apr 12, 2021, 01:07 PM ISTUpdated : Apr 12, 2021, 01:12 PM IST
నిజమే... జగన్ కు సవాల్ విసిరే స్థాయి లోకేష్ ది కాదు: అయ్యన్న సంచలనం

సారాంశం

బాబాయ్ వివేకా హ‌త్య‌తో సంబంధంలేక‌పోతే 14న వెంకన్న సాక్షిగా ప్ర‌మాణం చేయ‌మ‌ని మీ య‌జ‌మానికి చెప్పొచ్చు క‌దా? అని వైసిపి నాయకులకు సూచించారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. 

విశాఖపట్నం: వైఎస్ జగన్ కి స‌వాల్ విసిరే స్థాయి నారా లోకేష్ ది కాద‌ని తాడేప‌ల్లి గేటు ద‌గ్గ‌ర‌ పెడిగ్రీ తినే విశ్వాసంతో కొన్ని ఊర‌కుక్క‌లు మొరుగుతున్నాయి. నిజ‌మే జ‌గ‌న్ రెడ్డిలా 43 వేల కోట్లు దోపిడీ చేసే స్థాయి లోకేష్ ది కాదు. 31 కేసులున్న నేర‌చ‌రిత్ర స్థాయి లోకేష్‌కి లేదు. బాబాయ్ హ‌త్య కేసు ద‌ర్యాప్తుని అడ్డుకునేంత స్థాయి లోకేష్‌కి ఎప్ప‌టికీ రానే రాదు. స‌వాల్‌కి స్పందించాలంటే ద‌మ్ముండాలి కానీ, స్థాయిలెందుకు? వివేకా హ‌త్య‌తో సంబంధంలేక‌పోతే 14న వెంకన్న సాక్షిగా ప్ర‌మాణం చేయ‌మ‌ని మీ య‌జ‌మానికి చెప్పొచ్చు క‌దా?'' అంటూ ట్విట్టర్ వేదికన అయ్యన్న విరుచుకుపడ్డారు. 

''ప్రత్యేక హోదా కోసం రాజీనామా చెయ్యరు. విశాఖ ఉక్కు కోసం నో రాజీనామా. విశాఖ రైల్వే జోన్ కోసం రాజీనామా మాట ఎత్తరు. తిరుపతి ఉపఎన్నికలో ఓడిపోతే 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని వైకాపా ప్రకటించడం జగన్ రెడ్డి అధికార కాంక్షకి పరాకాష్ట. ఎంపీ సీటు పై ఉన్న ప్రేమ రాష్ట్ర సమస్యలపై లేకపోవడం దారుణం. రాజీనామా డ్రామాతో వైకాపా అసలు రంగు బయటపడింది'' అని మండిపడ్డారు. 

14న తిరుపతి వచ్చి ఉంటే బాబాయ్ హత్య మిస్టరీ తేలిపోయేది. అందుకే జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు. వెంకన్న సాక్షిగా ప్రమాణం అనగానే పరార్. వివేకా గారి హత్యతో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదు... 14న వెంకన్న సాక్షిగా ప్రమాణానికి సిద్ధం అని లోకేష్ ఛాలెంజ్ విసరగానే పులివెందుల పిల్లి తోకముడిచింది. పేరాసిట్మాల్ బ్యాచ్ కరోనా అనగానే విషయం అందరికీ అర్థమైపోయింది'' అంటూ అయ్యన్న ఎద్దేవా చేశారు. 

read more   వెంకన్నపై ప్రమాణానికి లోకేష్ రెడీ...జగన్ రెడ్డి రెడీనా?: మాజీ మంత్రి సవాల్

ఇంతకుముందు కూడా లోకేష్ సవాల్ పై అయ్యన్న ఘాటుగా ఇదే ట్విట్టర్ వేదికన ఘాటుగా స్పందించారు. ''మౌనం అర్దాంగీకారం. బాబాయ్ ని వేసేసింది అబ్బాయే అనడానికి ఇంతకన్నా ఆధారం ఏమి కావాలి?మా లోకేష్ సవాల్ విసిరాడు.14 తేదీన వెంకన్న సాక్షిగా ప్రమాణం చెయ్యడానికి సిద్దమా అని. బాబాయ్ హత్యతో సంబంధం లేకపోతే పులివెందుల పిల్లి మియాం అని ఎందుకు పారిపోయింది? ప్రతి దానికి బిగ్గరగా అరిచే బులుగు బ్యాచ్ ఎందుకు సైలెంట్ అయ్యింది? బాబాయ్ ని ఎవరు చంపారో14న తేలిపోతుంది'' అని అయ్యన్న ట్వీట్ చేశారు. 
 
''వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య గురించి లోక‌మంతా #whokilledbabai అని ప్ర‌శ్నిస్తోంది. అబ్బాయి మాత్రం నోరు విప్ప‌డంలేదు. అక్క సునీత ‌త‌న‌ తండ్రిని చంపిన హంత‌కుల్ని ప‌ట్టుకోమంటోంది. ప‌ట్టుకోగ‌ల‌వా? ఆ గొడ్డ‌లివేటు మీ ఇంటి రూటు చూపిస్తుంద‌ని భ‌య‌మా?'' అని ప్రశ్నించారు.

 ''ఎందుకీ మౌనం సీఎం గారు? అక్క ఢిల్లీలో, చెల్లి తెలంగాణ గ‌ల్లీల్లో అన్నే త‌మ‌కు అన్యాయం చేశాడ‌ని రోదిస్తుంటే ప‌ట్టించుకోని వైఎస్ జగన్... ఆంధ్ర‌ప్ర‌దేశ్ అక్కాచెమ్మ‌లంద‌రికీ న్యాయం చేస్తాన‌ని గాలి మాట‌లు చెబుతున్నాడు'' అని మండిపడ్డారు. 

''ఏ2 దొంగ రెడ్డీ! బాబాయ్ గొడ్డలితో గుండెపై పొడుచుకున్నాడా? మీరే గొడ్డలి వేటేసారా? ఓ చెల్లి తెలంగాణా రోడ్లపైనా, మరో చెల్లి ఢిల్లీలో అన్న కాదు అరాచకుడని నినదిస్తూ భయపెడుతున్నారా?'' అని అయ్యన్న పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు