రమేష్ కుమార్ తో బిజెపి నాయకులు భేటీ... మా అనుమానాలివే: హోంమంత్రి సుచరిత

Arun Kumar P   | Asianet News
Published : Jun 23, 2020, 09:46 PM ISTUpdated : Jun 23, 2020, 09:50 PM IST
రమేష్ కుమార్ తో బిజెపి నాయకులు భేటీ... మా అనుమానాలివే: హోంమంత్రి సుచరిత

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు రహస్యంగా భేటీ కావడంపై అనేక అనుమానాలున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. 

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు రహస్యంగా భేటీ కావడంపై అనేక అనుమానాలున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ఈ నెల 13 న ఓ హోటల్ లో ఒకరి తరవాత ఒకరు రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ నాయకులతో కలవాల్సిన అవసరం ఏముందన్నారు.

 స్థానిక సంస్థలు ఎన్నికల విషయంలో కూడా ఉద్దేశపూర్వకంగా నిమ్మగడ్డ ప్రవర్తించాడని గుర్తుచేశారు. ఇప్పుడు బీజేపీ నాయకులతో సమావేశమై ఎటువంటి కుట్రలకు సన్నాహాలు చేస్తున్నారో అనే అనుమానం కలుగుతోందన్నారు. గతంలో కూడా టీడీపీ ఇటువంటి హోటల్ సమావేశాలు, రాజకీయ కుట్రలు చేయడం మనం చూసామన్నారు. 

వీడియో

"

బీజేపీలో పదవి ఉన్నప్పటికీ..టీడీపీ కోసం పనిచేస్తున్న సుజనా, కామినేని లపై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా నిమ్మగడ్డ, సుజనా, కామినేని రహస్యంగా హోటల్ లో ఎందుకు సమావేశమయ్యారో చెప్పాలని హోంమంత్రి మేకతోటి సుచరిత డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జరుగుతున్న రచ్చ గురించి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి సంబంధించిన ఒక వీడియో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిమ్మగడ్డ 13వ తేదీనాడు రాత్రి హైదరాబాద్ లోని ఒక హోటల్ లో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్ రావు, సుజనా చౌదరీలతో భేటీ అయినట్టుగా ఈ వీడియో ఆధారంగా తెలుస్తుంది. దీనిపై వైసీపీ నేతలు రమేష్ కుమార్ పై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 

సీసీ ఫుటేజ్ వీడియోలో ఈ నెల 13వ తేది రాత్రి10:47 కు సుజనా చౌదరి, 11.23 కు కామినేని, 11.44కు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ హోటల్‌కి వచ్చినట్టుగా రికార్డు అయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఆ ముగ్గురినీ ఒకరే రిసీవ్ చేసుకున్నారు. ఆ తరువాత ఒకే గదిలో దాదాపు గంటకు పైగా ఆ ముగ్గురు చర్చలు సాగించినట్టుగా ఆ వీడియో ఆధారంగా తెలుస్తుంది. 

read more   రహస్య సమావేశం కాదు, నిమ్మగడ్డతో కుటుంబ స్నేహం: సుజనా

ఈ వీడియోపై వైసీపీ నేతలు రమేష్ కుమార్ పై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానంటూ, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాను అని చెప్పుకునే రమేష్ కుమార్ ఇలా చేయడమేమిటని  వారు ధ్వజమెత్తుతున్నారు. 

రాష్ట్రప్రభుత్వం పై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్రమైన ఆరోపణలు చేయడానికి, ఆ ఆరోపణల వెనుక కుమ్మక్కు ఉంది అని అనడానికి ఇది బలమైన సాక్ష్యమని వారు అభివర్ణిస్తున్నారు. కోర్టులో కేసులు నడుస్తున్నసమయంలో ఇలా అదే కేసుకు సంబంధించి పిల్ దాఖలు చేసిన వ్యక్తితో చర్చలు ఏమిటని వారు ఫైర్ అవుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్