శ్రీశైలం ఎడమ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీటిని నిలిపివేయాలి: కేఆర్ఎంబీకి ఏపీ ఫిర్యాదు

Published : Jun 28, 2021, 08:01 PM IST
శ్రీశైలం ఎడమ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీటిని నిలిపివేయాలి: కేఆర్ఎంబీకి ఏపీ ఫిర్యాదు

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలోని  విద్యుత్ సంస్థలకు నీటి విడుదలను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి  ఫిర్యాదు చేసింది. ఈ విషయమై కేఆర్ఎంబీ కూడ స్పందించింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని  విద్యుత్ సంస్థలకు నీటి విడుదలను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి  ఫిర్యాదు చేసింది. ఈ విషయమై కేఆర్ఎంబీ కూడ స్పందించింది.శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది.  అయితే  తెలంగాణ ప్రభుత్వం  రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థలకు వంద శాతం జల విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని ఆదేశించింది. 

also read:తెలంగాణ వాటాఒక్క చుక్క నీటిని కూడ వదులుకోం: వైఎస్ షర్మిల

శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ను ఉత్పత్తి చేయడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ విషయమై కెఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది.  శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ విషయమై తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణ పనులను ఏపీ చేపట్టడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కు ఫిర్యాదు చేసింది.

  

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ రెండ్రోజులు ప్రమాదకరమైన వర్షాలు, ఆరు జిల్లాలకు అలర్ట్
Kandula Durgesh: అసెంబ్లీ లో కందుల దుర్గేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu