ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం కుంటముక్కలలోని APSWR జూనియర్ కాలేజీలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, వసతులు, పరిశుభ్రత, భోజన ఏర్పాట్లు వంటి అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.