AP 10th: అన్నింటిలో సున్నా మర్కులు... సైన్స్‌లో ఒక్క మార్కు.. ఇంకోచోట 600కి 600.. వింత ఫలితాలు!

Published : Apr 23, 2025, 02:33 PM ISTUpdated : Apr 23, 2025, 02:36 PM IST
AP 10th: అన్నింటిలో సున్నా మర్కులు... సైన్స్‌లో ఒక్క మార్కు.. ఇంకోచోట 600కి 600.. వింత ఫలితాలు!

సారాంశం

AP 10th Results 2025: ఏపీ పదో తరగతి ఫలితాలు ఈసారి డిఫరెంట్‌గా ఉన్నాయి. ఓ విద్యార్థికి 600 మార్కులకు గాను కేవలం ఒకే ఒక్క మార్కు వచ్చింది. మరోచోట ఓ విద్యార్థినికి  ఒక్క మార్కు కూడా తగ్గకుండా.. 600కి 600 మార్కులు వచ్చాయి. ఈ ఫలితాలు చూసిన తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు అవాక్కవుతున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? 

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈ సంవత్సరం మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 81.14% నమోదైంది. 

ఇక ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణత రేటుతో మొదటి స్థానంలో ఉంది. చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా 47.64 శాతంతో పరిమితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,680 పాఠశాలల్లోని విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. అమ్మాయిలు 84.09 శాతం, అబ్బాయిలు 78.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 5 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. 

ఈ ఏడాది ఫలితాల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,680 పాఠశాలల్లోని విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 పాఠశాలల్లో మాత్రం ఒక్కరు కూడా పాస్‌ కాలేదు. 

ఈ ఫలితాలు అలా ఉంచితే.. కాకినాడ జిల్లాకు చెందిన నేహాంజని అనే విద్యార్థినికి 600 మార్కులకు గాను 600 మార్కులు వచ్చాయి. మరోచోట ఓ విద్యార్థికి సైన్స్‌ సబ్జెక్టులో కేవలం ఒక్క మార్కు రాగా.. మిగిలిన సబ్జెక్టుల్లో అన్నీ సున్నాలు వచ్చాయి. దీంతో 600కి కేవలం 1 మార్కు తెచ్చుకున్నాడు. దీని చూసిన నెటిజన్లు దయదలిచి ఆ ఒక్క  మార్కు వేసుంటారు.. సున్నాలు వేస్తా బాగుండని కామెంట్లు చేస్తున్నారు.

పదో తరగతితో ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28, వరకు నిర్వహించనున్నటల్లు మంత్రి లోకేష్‌ తెలిపారు. సప్లిమెంటరీ ఫీజు ఈ నెల 24 నుంచి 30 వ తేదీ వరకు అదనపు రుసుము చెల్లించకుండా ఫీజులు చెల్లించుకోవచ్చని తెలిపారు. అదనపు రుసుము రూ.50తో.. మే 18వ తేదీ వరకు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Naidu With Bhuvaneshwari at Raj Bhavan ‘At Home’ Event | Asianet News Telugu
‘స్త్రీ శక్తి' లబ్ధిదారులతో సామాన్యుడిలా టికెట్ తీసుకుని ప్రయాణించిన సీఎం | Stree Shakti Scheme