ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్: ఎంతశాతం మంది పాస్ అయ్యారంటే

Published : Jun 12, 2025, 06:36 PM IST
Maharashtra Board Results 2025

సారాంశం

ఏపీలో 10వ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో బాలికలు 80.10% ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్‌కు జూన్‌ 13 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం సాయంత్రం విడుదల అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,23,477 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 76.14గా నమోదైంది. అధికారుల ప్రకారం, బాలికలు 80.10 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 73.55 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.

ఈ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28వ తేదీ వరకు జరిపారు. ప్రధాన ఫలితాల్లో విఫలమైన విద్యార్థుల కోసం ఈ పరీక్షలను నిర్వహించారు. ఇప్పుడు విడుదలైన ఫలితాల్లో చాలామంది ఉత్తీర్ణులవ్వడం గమనార్హం.

ఫలితాల్లో సరిగా మార్కులు రాలేదని భావిస్తున్న విద్యార్థులకు మరో అవకాశంగా రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ అవకాశం కల్పించారు. జూన్‌ 13 నుంచి 19వ తేదీ వరకు ఈ సేవల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు సంబంధిత పాఠశాలల ద్వారా లేదా ఆన్లైన్‌ విధానంలో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

ఈ ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తుకు కీలకం కానున్నాయి. మరింత సమాచారం కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి అరెస్ట్‌.. శ్రీకాకుళంలో ఉద్రిక్త పరిస్థితులు
సీఎం చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్ | YS Jagan Mass Warning to CM Chandrababu | Asianet News Telugu