హాస్పిటల్ లో చేరిన అన్నకు తోడుగా వచ్చిన ఇంటర్ విద్యార్థినిపై యువకుడి అత్యాచారం.. మన్యం జిల్లాలో ఘటన

By Asianet NewsFirst Published May 20, 2023, 6:52 AM IST
Highlights

హాస్పిటల్ లో చేరిన అన్నకు తోడుగా ఉందామని వచ్చిన ఓ బాలికపై వేరే రోగికి తోడుగా వచ్చిన యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఏపీలోని మన్యం జిల్లాలో ఉన్న ప్రభుత్వ  ప్రాంతీయ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. 

సోదరుడు అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. దీంతో అతడికి తోడుగా ఇంటర్ చదివే 17 ఏళ్ల సోదరి వచ్చి ఉంటోంది. వారు ఉంటున్న వార్డులోనే మరో పేషెంట్ కు తోడుగా వచ్చిన యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకొని ఆ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.

సీఎం పదవి రేసులో సిద్ధరామయ్య గెలిచినా.. డీకే శివ కుమార్ కే అధిక ప్రయోజనాలు.. ఎలాగంటే ?

పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మన్యం జిల్లాలోని సీతంపేట మండలానికి చెందిన ఓ యువకుడు ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చికిత్స కోసం అతడు పాలకొండలో ఉన్న ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్ లో చేరాడు. అయితే అతడికి తోడుగా ఇంటర్మీడియట్ చదివే 17 ఏళ్ల చెల్లెలు ఉంటోంది. అయితే హాస్పిటల్ లోని అదే వార్డులో చికిత్స పొందుతున్న ఓ రోగికి తోడుగా ఉంటున్న పాలకొండ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.

‘అహిందా’ వ్యూహంలో నిపుణుడు, ఫోన్ వాడని నాయకుడు సిద్ధరామయ్య.. ఇతర పార్టీల్లో కూడా గౌరవం ఆయన సొంతం

ఈ పరిచయాన్ని అతడు దుర్వినియోగం చేసుకోవాలని అనుకున్నాడు. గత గురువారం రాత్రి సమయంలో హాస్పిటల్ లోని టాయిలెట్ లో ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాధితురాలు తన కుటుంబ సభ్యులు తెలియజేసింది. ఆమెకు తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. దీంతో అదే హస్పిటల్ లో ఉన్న డాక్టర్లను ఆశ్రయించారు. వారు బాలికకు వైద్యం అందించారు. తరువాత పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు అక్కడికి చేరుకొని హాస్పిటల్ లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను చూశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

click me!