తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మత్య్సకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లకూడదని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పురాతన భవనాల్లో ఉండకూడని తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లో, నీరు నిల్వ ఉండే ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లకు చేరుకోనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.