కేన్స్ టెక్నాలజీస్ ( Kaynes Technology IPO ) స్టాక్ మార్కెట్లో సందడితో ప్రారంభమైంది. మంగళవారం బీఎస్ఈలో కేన్స్ టెక్నాలజీస్ 32.03 శాతం పెరిగి రూ.775 వద్ద లిస్టైంది. అంటే, కంపెనీ షేర్లను కేటాయించిన ఇన్వెస్టర్లకు ప్రారంభంలోనే రూ.188 లాభాన్ని ఆర్జించారు. నవంబర్ 21, 2022న, కంపెనీ షేర్లు రూ. 230 ప్రీమియంతో గ్రే మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. అప్పుడే బంపర్ లిస్టింగ్పై ఆశలు చిగురించాయి.