Kerala Gold Smuggling Case: కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన భార్య, కుమార్తె ప్రమేయం ఉందని ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ మంగళవారం కోర్టులో వెల్లడించడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. అయితే.. ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించి స్వప్నా సురేష్ ఆరోపణలను రాజకీయ ఎజెండాలో భాగమని అభివర్ణించారు.