Bank Strike: ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ యోచనతో పాటు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి నిరసనగా బ్యాంకు యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. మార్చి 28, 29 తేదీల్లో బ్యాంకులు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో సోమవారం-మంగళవారం నాడు బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కావచ్చని ఎస్బీఐ తన ఖాతాదారులకు తెలియజేసింది.