కొరియన్ గ్లాస్ స్కిన్ ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. మీ చర్మం కూడా గాజులా మెరవాలంటే ముఖానికి ఏం రాయాలో తెలుసుకుందామా...
ఈ రోజుల్లో కొరియన్ స్కిన్ కేర్ అంటే చాలామందికి ఇష్టం. వాళ్లలాగా మెరిసే చర్మం కావాలని చాలామంది అనుకుంటారు. కొరియన్లు వాళ్ల చర్మ సంరక్షణ కోసం ఇంటి చిట్కాలు వాడుతారు. రసాయనాలతో ఉండే ఫేస్వాష్ల బదులు బియ్యం నీళ్లతో ముఖం కడుక్కుంటారని మీకు తెలుసా? మీరు చదివింది నిజమే. కొరియన్ల బ్యూటీ సీక్రెట్ కేవలం మనం రోజూ తినే బియ్యమే. ఆ బియ్యాన్ని కడిగి.. ఆ నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల మీ అందం కూడా పెరుగుతుంది.
బియ్యం కడిగిన నీళ్లు చర్మానికి మంచి టోనర్ లాగా పనిచేస్తాయి. చర్మ సమస్యలు పోగొట్టడానికి సహాయపడతాయి. బియ్యం నీళ్లను ఎలా వాడాలి, ఇంట్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసి 30 నిమిషాలు నానబెట్టండి. తర్వాత ఆ నీళ్లను ఒక స్ప్రే బాటిల్లో తీసి పెట్టుకోండి. దూదిని ఉపయోగించి ముఖానికి రాయండి. నెమ్మదిగా మసాజ్ చేయండి. రోజుకి 2 లేదా 3 సార్లు ఇలా చేయొచ్చు.
బియ్యం నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మం రంగు మారుతుంది. చర్మం మీద ఉన్న చనిపోయిన కణాలు పోతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి, సి చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. బియ్యం నీళ్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి చర్మం మీద వాపులు, మంటను తగ్గిస్తాయి.
క్రమం తప్పకుండా వాడితే చర్మం సహజంగా మెరుస్తుంది. బియ్యం నీళ్లు చర్మంలో తేమని కాపాడతాయి. మీ చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. ఇది చర్మాన్ని సహజంగా శుభ్రం చేస్తుంది. ఇది చర్మం మీద వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. ముడతలు, వయసు మీద పడడం వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది, మీ ముఖానికి తాజాగా ఉండేలా చేస్తుంది.