కొత్త స్నేహితులతో అనుష్క శర్మ.. ఫోటో వైరల్..!

By telugu news teamFirst Published Sep 3, 2021, 11:41 AM IST
Highlights

ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు కోసం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.  కాగా.. ఆ లండన్ ట్రిప్ కి.. క్రికెటర్లంతా తమ భార్యలతో సహా వెళ్లారు. 

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ..  కొత్త స్నేహితులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇంతకీ ఆ కొత్త స్నేహితులు ఎవరో తెలుసా..? ఇండియన్ క్రికెటర్ల భార్యలు కావడం గమనార్హం. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు కోసం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.  కాగా.. ఆ లండన్ ట్రిప్ కి.. క్రికెటర్లంతా తమ భార్యలతో సహా వెళ్లారు. కాగా.. ఇప్పుడు వారంతా కలిసి గ్రూప్ ఫోటో దిగారు.

వారిలో బుమ్రా భార్య, టీవీ ప్రజంటేటర్ సంజనా గణేషన్, ఇషాంత్ శర్మ భార్య ప్రతిమా సింగ్, రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతీ నారాయణన్, మయాంక్ అగర్వాల్ భార్య ఆషితా సూద్ లు ఉన్నారు,

వీరంతా కలిసి దిగిన ఈ గ్రూప్ ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలో అనుష్క శర్మ.. పూల డిజైన్ ఉన్న షర్ట్ , నేవీ బ్లూ కలర్ ఫ్యాంట్ ధరించారు. చాలా అందంగా కనిపిస్తుండటం విశేషం.

ఇదిలా ఉండగా.. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ లు ఈ ఏడాది మొదట్లో తల్లిదండ్రులయ్యారు. వారి ముద్దుల కుమార్తె వామిక ఇటీవల ఆరు నెలలు పూర్తి చేసుకుంది. వామిక ముఖం కనపడకుండా.. ఫోటోలను విరాట్ , అనుష్క లు గతంలో షేర్ చేశారు. 

click me!