బరువు తగ్గిన స్మృతీ ఇరానీ.. ఎంత మారిపోయిందో చూశారా..?

By telugu news teamFirst Published Aug 18, 2021, 1:05 PM IST
Highlights

ఆమె వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ షాకౌతున్నారు. అంత బరువు ఎలా తగ్గారా అని  అందరూ కామెంట్స్ చేస్తున్నారు. బరువు తగ్గిన తర్వాత.. స్మృతి ఇరానీ తన పాత లుక్ లోకి వచ్చేశారంటూ కొందరు కామెంట్స్ పెట్టడం గమనార్హం.

టీవీ నటిగా తన కెరిర్ ని మొదలుపెట్టి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. కేంద్ర మంత్రి పదవి స్థాయికి చేరుకున్న వ్యక్తి స్మృతీ ఇరానీ. ఆమెకు నటిగా ఎంత మంది అభిమానులు ఉన్నారో.. రాజకీయ నాయకురాలిగా కూడా అంతే ఆదరణ ఉందని చెప్పొచ్చు.  ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు పెడుతూ... తన ఫాలోవర్స్ ని చైతన్యపరుస్తూ ఉంటారు.  తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో.. మాస్క్ పెట్టుకోవడం ఎంత అవసరమో తెలియజేస్తూ.. ఓ పోస్టు షేర్ చేశారు. కాగా..  ఆ ఫోటోలను చూసి ఆమె అభిమానులంతా షాకౌతున్నారు.  ఎందుకంటే.. ఆ ఫోటోల్లో  ఆమె బరువు తగ్గి కనిపిస్తున్నారు.

ఆమె వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ షాకౌతున్నారు. అంత బరువు ఎలా తగ్గారా అని  అందరూ కామెంట్స్ చేస్తున్నారు. బరువు తగ్గిన తర్వాత.. స్మృతి ఇరానీ తన పాత లుక్ లోకి వచ్చేశారంటూ కొందరు కామెంట్స్ పెట్టడం గమనార్హం.

కొందరేమో.. వాట్ లే ట్రాన్స్ ఫర్మేషన్ మేడమ్.. ఇన్ స్పైరింగ్ అంటూ మెసేజ్ చేయడం విశేషం. స్మృతి ఇరానీ 2000 లో 'ఆతిష్', 'హమ్ హే కల్ ఆజ్ అవుర్ కల్'  సీరియల్స్ తో టెలివిజన్‌లో అడుగుపెట్టారు. ఆమె DD మెట్రో యొక్క 'కవిత'లో కూడా కనిపించారు. ఆమె 2001 లో జీ టీవీ రామాయణంలో  సీత దేవి  పాత్రను పోషించారు. 

కానీ ఏక్తా కపూర్ రాసిన బాలాజీ టెలిఫిల్మ్స్ టీవీ సబ్బు 'క్యుంకి సాస్ భీ కభీ బహు థీ'తో స్మృతికి పేరు వచ్చింది. ఆ సీరియల్ లో ఆమె తులసి పాత్ర పోషించగా.. అది మంచి పేరు తెచ్చిపెట్టింది. 

ఆమె ఉత్తమ నటిగా వరుసగా ఐదు ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును గెలుచుకున్నారు. - నాలుగు ఇండియన్ టెలీ అవార్డులు కూడా గెలుచుకున్నారు.

 

click me!