బెంగాల్ ఎన్నికలు: 148 మందితో బీజేపీ మరో జాబితా.. లిస్ట్‌లో ప్రముఖులు

Siva Kodati |  
Published : Mar 18, 2021, 07:49 PM ISTUpdated : Mar 18, 2021, 07:50 PM IST
బెంగాల్ ఎన్నికలు: 148 మందితో బీజేపీ మరో జాబితా.. లిస్ట్‌లో ప్రముఖులు

సారాంశం

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మరో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 5, 6, 7, 8 విడతల్లో పోటీ చేయబోయే 148 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ గురువారం విడుదల చేశారు. 

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మరో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 5, 6, 7, 8 విడతల్లో పోటీ చేయబోయే 148 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ గురువారం విడుదల చేశారు.

ఈ జాబితాలో పార్టీ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌, రాహుల్‌ సిన్హా, అసిమ్‌ సర్కార్‌ పేర్లు ఉన్నాయి. గతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించడంతో పాటు కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన ముకుల్‌ రాయ్‌ ఈ ఎన్నికల్లో కృష్ణా నగర్‌ నార్త్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.   

ఇప్పటికే తొలి నాలుగు విడతల ఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. తాజాగా మిగిలిన విడతలకు పోటీచేయబోయే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇంకా 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 8 దశల్లో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మే 2 న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

PREV
click me!

Recommended Stories

ఎమ్మెల్యేగా మారిన క్రికెటర్.. షిబ్‌పూర్ లో సిక్సర్ కొట్టిన మనోజ్ తివారి !
బెంగాల్‌లో పుంజుకున్నాం.. మమతా బెనర్జీకి అభినందనలు: ప్రధాని మోడీ ట్వీట్