ఢిల్లీ మెట్రో సరసన ముంబై లోకల్ ట్రైన్.. సీటు కోసం పిచ్చికొట్టుడు కొట్టుకున్నారు.. వీడియో వైరల్..

By SumaBala BukkaFirst Published Sep 2, 2023, 2:19 PM IST
Highlights

ఢిల్లీ మెట్రోలో వీడియోలు వైరల్ అయ్యే సంగతి తెలిసిందే. ఈ వరుసలో ఇప్పుడు ముంబై లోకల్ ట్రైన్ చేరుతోంది. లోకల్ ట్రైన్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఓ గొడవకు చెందిన వీడియో తెగ వైరల్ అవుతోంది. 

ముంబై : సీటు కోసం కొట్లాట రాజకీయాల్లోనే కాదు.. లోకల్ ట్రైన్స్ లోనూ కామన్ అయిపోయింది. ఢిల్లీ మెట్రోలో చిత్ర విచిత్రాల తరువాత ఆ కోవలోకి ముంబై లోకల్ ట్రైన్ చేరింది. సీటుకోసం పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు ఇద్దరు వ్యక్తులు. మామూలుగా వైరల్ అయ్యే వీడియోల్లాగే ఇది వైరల్ అయ్యింది. 

ముంబై లోకల్ ట్రైన్ కంపార్ట్‌మెంట్ లోపల తీసిన వీడియోలో ఇద్దరు వ్యక్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం కనిపిస్తుంది. కిక్కిరిసిన ముంబై లోకల్ ట్రైన్‌లో సీటు కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వైరల్ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 

ఆదిత్య ఎల్1 లాంచింగ్ విజయవంతం.. ఇస్రోకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము అభినందనలు..

వీడియోలో, ఇద్దరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగి, ఒకరిమీద ఒకరు భౌతిక దాడికి పాల్పడ్డారు. మామూలుగానే ముంబైలో రద్దీగా ఉండే లోకల్ రైళ్లలో సీట్లు పరిమితంగా ఉంటాయి. వీటికోసం రోజూ తీవ్ర పోటీఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

అయితే, నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది కేవలం వీడియోలో ఉన్న ఫైట్ మాత్రమే కాదు.. వారి ఘర్షణతో పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించే విధంగా శాంతియుతంగా వ్యవహరించిన ఓ తోటి ప్రయాణీకుడి అద్భుతమైన జోక్యం.

వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ ఘటనను ఢిల్లీ మెట్రో ఘటనలతో పోల్చారు. ఢిల్లీ మెట్రో, తరచూ తగాదాలు, విచిత్రమైన పరిస్థితులు.. వైరల్ వీడియోలుగా వెలుగులోకి వచ్చే సంగతి తెలిసిందే. అలాగే ముంబై లోకల్ రైలు గొడవ రూపంలో ఈ వీడియో వాటి సరసన చేరింది. 

ఢిల్లీ మెట్రోలోని విచిత్రమైన పరిస్థితులకు ముంబై లోకల్ రైళ్లు గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 

click me!