35 రోజులుగా ఒకే రూములో 25 మంది.. అజ్మీర్ లో ఆంధ్రా వాసుల కష్టాలు..

May 1, 2020, 3:54 PM IST

లాక్ డౌన్ కారణంగా కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ వాసులు 35 రోజులుగా రాజస్థాన్ అజ్మీర్ లో చిక్కుకుపోయారు. తామంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గంలోని వారిమేనని, మంత్రి చొరవతో తమని రాష్ట్రానికి రప్పించాలని వేడుకుంటున్నారు. తమ దగ్గరి డబ్బులు కూడా అయిపోయాయని, తిండికూడా లేక ఇబ్బంది పడుతున్నామని దయ చూపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంటున్నారు.