ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన రాణి చెన్నమ్మ

ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన రాణి చెన్నమ్మ

Published : Jul 26, 2022, 11:23 AM ISTUpdated : Aug 07, 2022, 08:44 AM IST

ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జ‌రిగిన పోరాటంలో ప్రాణాలర్పించిన వీర‌వ‌నిత కిత్తూరు మ‌హారాణి చెన్నమ్మ.

ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జ‌రిగిన పోరాటంలో ప్రాణాలర్పించిన వీర‌వ‌నిత కిత్తూరు మ‌హారాణి చెన్నమ్మ. ఆమె 1778లో ఉత్తర కర్ణాటకలోని ప్రస్తుత బెల్గావి జిల్లాలోని కాకతి అనే చిన్న గ్రామంలో లింగాయత్ కుటుంబంలో జన్మించింది. ఆమె చిన్నతనంలో గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించింది. చెన్నమ్మకు  దేశాయ్ యువరాజు మల్ల సర్జాతో వివాహం జరిగింది. తన భర్త అకాల మరణంతో.. చెన్నమ్మ తమ దత్తపుత్రుడు శివలింగప్పను కొత్త రాజుగా నియ‌మించడానికి చ‌ర్య‌లు తీసుకుంది. అయితే, రాజుకు వారసులు ఎవరూ లేరని పేర్కొంటూ, ఈస్ట్ ఇండియన్ కంపెనీ వారి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చింది. అయితే, రాణి చెన్నమ్మ కంపెనీ ఆజ్ఞల‌ను ధిక్కరిస్తూ.. ఆంగ్లేయుల‌కు వ్య‌తిరేకంగా పోరాటం సాగించింది. 

1824లో ఈస్టిండియా కంపెనీ సైన్యానికి రాణి చెన్నమ్మ దళాల మ‌ధ్య భీక‌ర పోరు జ‌రిగింది. కంపెనీ సైన్యానికి అధిపతి అయిన సర్ జాన్ థాకరేను రాణి చెన్నమ్మ  సేనాధిపతి బాలప్ప కాల్చి చంపారు. ఇద్దరు అగ్రశ్రేణి బ్రిటీష్ అధికారులను కూడా బంధించారు. ఒక్కసారిగా భారీ షాక్ తగిలిన ఆంగ్లేయులు చేసేదేమీ లేక కాల్పుల విరమణకు ముందుకొచ్చారు.  చెన్నమ్మ ఈ ప్రతిపాదనను అంగీకరించి వారిని విడుదల చేసింది. అయితే, నమ్మకద్రోహమైన ఈస్ట్ ఇండియా కంపెనీ కిత్తూరుపై దాడి చేయడానికి మళ్లీ బలగాలను పంపింది. భీకర యుద్ధంలో రాణి చెన్న‌మ్మ‌ను బంధించి బైల్‌హోంకెల్ కోటలో ఉంచారు. రాణి సేనాధిపతి సంగొల్లి రాయన్న పట్టుబడి ఉరి తీయబడ్డారు. చెన్న‌మ్మ‌ దత్తపుత్రుడిని కూడా అరెస్టు  చేసి.. జైలులో బంధించారు. రాణి చెన్నమ్మ కోటలోనే మరణించి అమరవీరురాలైంది.

05:52 ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
00:20 సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్
01:20బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్ గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్ కు వరించిన అదృష్టం
03:35 AP- వ్యవస్థలను జగన్ నాశనం చేశారు- మంత్రి అచ్చెన్నాయుడు
04:00వివేకానందుని సన్నిధిలో ప్రధాని మోదీ ధ్యానం.. అప్పుడు ఉతర భారత్.. ఇప్పుడు దక్షిణ భారత్.. నరేంద్ర మోదీ ప్లాన్ మా
02:46తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..
01:35కోతికి సీపీఆర్ చేసి బ్రతికించిన కానిస్టేబుల్.... కామెంట్ల తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..
02:08విమానంలో బాంబు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పరుగులు పెట్టిన ప్యాసింజర్.. చివరకు ఏమయ్యిందంటే..?
01:46రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం... అయినా తగ్గని కాంగ్రెస్ నేత...
02:06మన ఆడియన్స్ ఇంత కఠినంగా ఉంటారు అనుకోలేదు..... మంచు లక్ష్మి మనసులో మాట బయటపెట్టిందిగా...