అయోధ్య ... హిందూ ముస్లింల చారిత్రాత్మక ఐక్యతకు చిహ్నం

అయోధ్య ... హిందూ ముస్లింల చారిత్రాత్మక ఐక్యతకు చిహ్నం

Published : Jun 25, 2022, 12:42 PM IST

దేశ విభ‌జ‌న త‌ర్వాతి నుంచి భార‌త్ లో హిందూ-ముస్లింల మ‌ధ్య కొన్ని విభ‌జ‌న రేఖ‌లు అంత‌రాల‌ను పెంచుతూనే ఉన్నాయి.

దేశ విభ‌జ‌న త‌ర్వాతి నుంచి భార‌త్ లో హిందూ-ముస్లింల మ‌ధ్య కొన్ని విభ‌జ‌న రేఖ‌లు అంత‌రాల‌ను పెంచుతూనే ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య అంత‌రాలు మ‌రింత‌గా పెరిగాయి. ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారితీశాయి. అయోధ్య నేడు హిందువులు-ముస్లింల మధ్య తీవ్రమైన ఉద్రిక్త‌త‌కు దారితీసిన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. కానీ భార‌త స్వాతంత్య్ర పోరాటంలో హిందూ-ముస్లింల‌తో పాటు అనేక వ‌ర్గాల ప్ర‌జ‌లు క‌లిసిక‌ట్టుగా పోరాడారు. అయోధ్యలో ఈ రెండు వర్గాలు చేతులు కలిపి ఆంగ్లేయులతో  పోరాడి స‌రికొత్త చ‌రిత్ర‌ను లిఖించారు. ఈ రెండు వర్గాలలోని తీవ్రవాదులు సమాధి చేయాలనుకుంటున్న స్ఫూర్తిదాయకమైన చరిత్ర ఇది.. 1857లో భారతదేశ మొదటి స్వాతంత్య్ర పోరాటానికి బలం హిందూ-ముస్లింల‌ ఐక్యత. అయోధ్యలో ఈ సోదరభావం ఇద్దరు పూజారులు- అయోధ్య మౌల్వీ అమీర్ అలీ, ప్రసిద్ధ హనుమాన్ గర్హి ఆలయ ప్రధాన పూజారి బాబా రామ్ చరణ్ దాస్ల మైత్రీతో.. ఇరువురి ఆధ్వర్యంలో ఏర్పడింది. వారు 1857లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేత‌బ‌ట్టి పోరాటానికి ముందుకు నడిపించారు. చివ‌రికి వారిద్దరినీ బంధించి, అయోధ్యలోని ఫైజాబాద్ జైలులో ఉన్న కుబేర్ తేలా వద్ద చింతచెట్టుకు ఉరితీసి చంపారు. అలాగే, అయోధ్యలో ఆంగ్లేయులకు వ్య‌తిరేకంగా క‌లిసి పోరాటం సాగించిన హిందూ-ముస్లి వ‌ర్గాల‌కు చెందిన మరో ఇద్దరు ప్రముఖ నాయకులు ఫైజాబాద్ రాజు దేవి బక్ష్ సింగ్ కు చెందిన కమాండర్లు అకాన్ ఖాన్ మరియు శంభు ప్రసాద్ సుక్లా. ఖాన్- శుక్లా ఇద్దరూ 1857లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా విజయవంతమైన ప్ర‌చార హోరుకు నాయ‌క‌త్వం వ‌హించారు. ఈ క్ర‌మంలోనే ఆంగ్లేయులు వీరిద్ద‌రిని బంధించి ఉరితీశారు. ఇలా భార‌త మొద‌టి స్వాతంత్య్ర ఉద్య‌మం 1857గా పేరుగాంచిన స‌మ‌యంలో చోటుచేసుకున్న ప‌లు ఘ‌ట‌న‌లు హిందూ-ముస్లింల మ‌ధ్య ఉన్న చారిత్రాత్మక సంఘీభావం 1857 నాటి స్ఫూర్తి. ఇలా హిందూ-ముస్లిం వ‌ర్గాల‌కు చెందిన పోరాట స్ఫూర్తిని నింపిన వారు అనేక మంది ఉన్నారు. వారిలో నానా సాహెబ్మ్ బహదూర్ షా సఫర్, రాణి లక్ష్మీ బాయి, అహ్మద్ షా మౌల్వీ, తంతియా తోపే, ఖాన్ బహదూర్ ఖాన్, హజ్రత్ మహల్, అజీముల్లా ఖాన్ వంటి అనేక మంది ఉన్నారు.

05:52 ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
00:20 సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్
01:20బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్ గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్ కు వరించిన అదృష్టం
03:35 AP- వ్యవస్థలను జగన్ నాశనం చేశారు- మంత్రి అచ్చెన్నాయుడు
04:00వివేకానందుని సన్నిధిలో ప్రధాని మోదీ ధ్యానం.. అప్పుడు ఉతర భారత్.. ఇప్పుడు దక్షిణ భారత్.. నరేంద్ర మోదీ ప్లాన్ మా
02:46తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..
01:35కోతికి సీపీఆర్ చేసి బ్రతికించిన కానిస్టేబుల్.... కామెంట్ల తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..
02:08విమానంలో బాంబు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పరుగులు పెట్టిన ప్యాసింజర్.. చివరకు ఏమయ్యిందంటే..?
01:46రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం... అయినా తగ్గని కాంగ్రెస్ నేత...
02:06మన ఆడియన్స్ ఇంత కఠినంగా ఉంటారు అనుకోలేదు..... మంచు లక్ష్మి మనసులో మాట బయటపెట్టిందిగా...