జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన జయకేతనం పేరిట భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరై.. ప్రసంగించారు. దేశాన్ని ముక్కలు చేస్తామంటే ఊరుకోనని, భారతదేశం కోసం తన ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధమని స్పష్టం చేశారు.