మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడిని వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులు చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. తిరుమల లడ్డు ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన అసత్య ప్రచారం పూర్తిగా బట్టబయలయ్యిందన్నారు.