
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీశాయి. గుంటూరులో అంబటి నివాసంపై దాడులు జరగగా, దీనిని వైఎస్ జగన్ తీవ్రంగా ఖండిస్తూ శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయాయని ఆరోపించారు. వైయస్ఆర్సీపీ నేతలకు రక్షణ కల్పించాలని కేంద్రం, గవర్నర్ జోక్యం కోరారు.