మాచర్ల మంటలు : రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతల హౌస్ అరెస్ట్..

Dec 17, 2022, 12:56 PM IST

అమరావతి :మాచర్ల ఉద్రిక్తతల నేపథ్యంలో టీడీపీ నేతలు గుంటూరుకు బయల్దేరారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలు ఎక్కడకక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. పొన్నూరు నుంచి గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ను అక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బుద్ధ వెంకన్న మంగళగిరి పార్టీ ఆఫీస్ కి ప్రెస్ మీట్ కి వెళ్తుండగా అక్రమంగా అరెస్టు చేసి వన్ టౌన్  పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ అరెస్టులతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అని  టీడీపీ నేతలు,కార్యకర్తలు అంటున్నారు.