
విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ విద్యా సంస్థల స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థలో మార్పులు, విద్యార్థుల భవిష్యత్, నవీన విద్యా విధానాలు మరియు సమాజాభివృద్ధిలో విద్య పాత్రపై ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. విద్యతోనే రాష్ట్రం, దేశం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. సిద్ధార్థ అకాడమీ సంస్థలు గత 50 ఏళ్లుగా విద్యారంగంలో అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు.