Galam Venkata Rao | Published: Apr 13, 2025, 4:00 PM IST
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సడన్ గా బస్సు దిగి ఓ సెలూన్ లోకి వెళ్లారు. సెలూన్ యజమానితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నెలకు ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకున్నారు. అంతంత మాత్రంగానే ఆదాయం ఉంటోందని వారు చెప్పడంతో కొత్త సామగ్రి కొనుగోలు చేసి బహుమతిగా అందజేశారు . ఉండటానికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.