
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని వైయస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ గూండాలు చేసిన దాడి రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు.