విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పరడి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ను ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యతపై ఆయన అధికారులతో చర్చించారు.