Book Train Tickets: ట్రైన్ టికెట్స్ బుక్ చేయడం గురించి చాలా మందికి అవగాహన ఉండదు. IRCTC లాంటి యాప్స్, వెబ్ సైట్లలో బుక్ చేసినా కన్ఫర్మ్ అవుతాయన్న గ్యారెంటీ ఉండదు. రిస్క్ ఎందుకని చాలా మంది ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకుంటారు. డబ్బులు కూడా ఎక్కువ చెల్లిస్తుంటారు. ఇక్కడ రైలు టికెట్లు బుక్ చేసుకునే విధానాలను పూర్తి వివరాలతో అందిస్తున్నాం. అంతేకాకుండా బుకింగ్ పద్ధతులు, బోగీల రకాలు, రైల్వే నియమాలు, ప్రయాణాన్ని సులభతరం చేసే చిట్కాలు కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.
ఇండియన్ రైల్వే ఎంత పెద్ద రవాణా నెట్వర్క్ అంటే రోజుకు లక్షలాది మంది ప్రయాణికులను చేరవేస్తూ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే సంస్థగా నిలిచింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా జరగాలంటే రైలు టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవడం చాలా మంచిది. ట్రైన్ టికెట్స్ ఈజీగా బుక్ చేయాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
భారతీయ రైల్వే వేర్వేరు అవసరాలకు, బడ్జెట్లకు తగినట్టుగా చాలా రకాల రిజర్వ్ చేసిన బోగీలను అందిస్తుంది.
అడ్వాన్స్ బుకింగ్ - ప్రయాణికులు తమ ప్రయాణానికి 60 రోజుల ముందు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
తత్కాల్ బుకింగ్లు - చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి వస్తే, బయలుదేరే ముందు రోజు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ప్రీమియం తత్కాల్ - ఇవి కూడా తత్కాల్ టికెట్లే. కాని కాస్త ధర ఎక్కువ. అంటే ఈ తత్కాల్ టికెట్లు కచ్చితంగా బుక్ అవుతాయన్న మాట.
సీనియర్ సిటిజన్ రాయితీలు - 60+ వయస్సు ఉన్న పురుషులు, 58+ వయస్సు ఉన్న మహిళలకు టికెట్ ధరల్లో ప్రత్యేక తగ్గింపులు ఇస్తారు.
డిజిటల్ టికెట్ సిస్టమ్ - ప్రయాణికులు ఈ-టికెట్లు, ఎం-టికెట్లను ఉపయోగించి ప్రయాణాలు చేయొచ్చు.
PNR స్టేటస్ ట్రాకింగ్ - టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవడానికి ప్రయాణికులు ఎక్కే ముందు తమ PNR స్టేటస్ను చెక్ చేసుకోవాలి.
గుర్తింపు ధృవీకరణ - రైలు ప్రయాణం చేసుటప్పుడు కచ్చితంగా ఆధార్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ప్రభుత్వం జారీ చేసిన ఐడీని వెంట తీసుకెళ్లాలి.
లగేజీ పరిమితి - ఎక్కువ ఛార్జీలు పడకుండా ఉండాలంటే, లిమిటెడ్ లగేజీలనే తీసుకెళ్లండి.
సీటు, బోగీ కేటాయింపులు - ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సీట్లు, వాళ్ల ఛాయిస్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు.
రద్దు & డబ్బు వాపసు పాలసీ - బయలుదేరే ముందు టికెట్ రద్దు చేసిన సమయాన్ని బట్టి డబ్బు వాపసు వస్తుంది.
భారతీయ రైల్వే తన డిజిటల్ టికెట్ విధానాన్ని మెరుగుపరచడానికి పనిచేస్తోంది. దీనివల్ల రైల్వే స్టేషన్లలో పొడవైన క్యూలు తగ్గుతాయి. సీట్ల కేటాయింపునకు AIని ఉపయోగించాలని రైల్వే భావిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ఉపయోగించి ఎప్పటికప్పుడు సీట్ల లభ్యతను చెక్ చేయడం వల్ల సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు రైలు కనెక్టివిటీని పెంచడానికి కూడా పనిచేస్తోంది.
ఇది కూడా చదవండి రైలులో బెడ్షీట్ దొంగిలిస్తే శిక్ష ఏంటో తెలుసా?