హైదరాబాద్: పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నందుకు.. ఉద్యోగులను చితకబాది, కరెంట్ ఆఫీసులో రచ్చ

Siva Kodati |  
Published : Apr 19, 2022, 06:57 PM ISTUpdated : Apr 19, 2022, 06:59 PM IST
హైదరాబాద్: పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నందుకు.. ఉద్యోగులను చితకబాది, కరెంట్ ఆఫీసులో రచ్చ

సారాంశం

పెండింగ్ కరెంట్ బిల్లులు చెల్లించాలని అడిగినందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులను చితకబాదారు నలుగురు యువకులు. హైదరాబాద్ పాతబస్తీలోని కుల్సుంపురాలో ఈ ఘటన జరిగింది.   

హైదరాబాద్ (hyderabad) పాతబస్తీ (old city) కుల్సుంపురాలో (kulsumpura) ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. స్థానిక కరెంట్ ఆఫీస్‌పై (electricity office) యువకులు  దాడికి దిగారు. పెండింగ్ బిల్లుల వసూలుకు విద్యుత్ ఉద్యోగులు ఆ ప్రాంతంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా దొంగతనంగా విద్యుత్ వాడుతున్న వారిని అధికారులు గుర్తించారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని అధికారులు హెచ్చరించడంతో యువకులు రెచ్చిపోయారు. కరెంట్ ఆఫీసులోకి వచ్చి ఉద్యోగులను చితకబాదారు. మొత్తం నలుగురు యువకులు కార్యాలయంలో హంగామా సృష్టించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని  వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?