మరో నేతపై బూతుల వర్షం.. హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కవితపై వేటు

Siva Kodati |  
Published : Apr 19, 2022, 05:08 PM IST
మరో నేతపై బూతుల వర్షం.. హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కవితపై వేటు

సారాంశం

గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. మహిళా నేతలు సునీతరావు, కవిత మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న అధిష్టానం.. కవితా రావుపై వేటు వేసింది. 

హైదరాబాద్ (hyderabad city woman congress president) సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కవితపై (kavitha) అధిష్టానం వేటు వేసింది. ఇటీవల గాంధీ భవన్‌లో సునీతా రావు (sunitha rao) కవిత మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న హైకమాండ్... కవితను సిటీ  మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించింది. 

గత శనివారం గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. మహిళా నేతలు సునీతరావు, కవిత మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇరువురు బూతులు  తిట్టుకున్నారు. అనంతరం సమావేశంలో నుంచి కవిత బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?