పెద్దపల్లి జిల్లాలో నాలుగు రోజులుగా చెల్లి మృతదేహం పక్కనే: పోలీసుల దర్యాప్తు

Published : Jan 17, 2022, 10:04 PM IST
పెద్దపల్లి జిల్లాలో నాలుగు రోజులుగా చెల్లి మృతదేహం పక్కనే: పోలీసుల దర్యాప్తు

సారాంశం

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ లో మారోజు శ్వేత మరణించింది. అయితే శ్వేత మరణించిన ఆమెతో పాటు ఆమె సోదరి స్వాతి నాలుగు రోజులుగా ఆమెతో కలిసి ఉంది. ఇంటి నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయం వెలుగు చూసింది.


కరీంనగర్: చనిపోయిన చెల్లె dead bodyతో నాలుగు రోజులుగా sister  కలిసివున్న సంఘటన peddapalli జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రగతి నగర్ లో జీవిస్తున్న మారోజు Swetha(24) నాలుగు రోజుల క్రితం మృతి చెందింది. చెల్లెలు మృతిచెందిన విషయం బయటకు చెప్పకుండా  శ్వేత సోదరి Swathi నాలుగు రోజులుగా అదే ఇంట్లో జీవనం సాగిస్తోంది. సోమవారం తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు police లకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎస్సై rajesh, ఎస్సై రాజ వర్ధన్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. శ్వేత ఎలా మృతి చెందిందనే విషయం తెలియాల్సి ఉంది.

గత 10 రోజులుగా శ్వేత జ్వరంతో బాధపడుతుందని పోలీసులకుస్వాతి చెప్పింది. ఆమెను ఆసుపత్రి తీసుకెళ్లలేదన్నారు. జ్వరంతోనే తన సోదరి శ్వేత మరణించినట్టుగా స్వాతి పోలీసుల విచారణలో తెలిపింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం