మంత్రితో సమావేశానికి గైర్హాజరు... అధికారులపై భువనగిరి జిల్లా కలెక్టర్ సీరియస్ యాక్షన్

By Arun Kumar PFirst Published Jul 6, 2021, 11:56 AM IST
Highlights

విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరుకాని అధికారులపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. 

భువనగిరి: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై యాదాద్రి భువనగిరి జిల్లా  కలెక్టర్ ప్రమేలా సత్పతి సీరియస్ అయ్యారు. విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరుకాని అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. బొమ్మలరామారం, రాజపేట,గుండాల ఎమ్మార్వోలతో పాటు భువనగిరి మున్సిపల్ కమిషనర్, విద్యుత్ డీఈలకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు కలెక్టర్ ప్రమేల. 
 

click me!