hijab row: క‌ర్నాట‌క హిజాబ్ విద్యార్థుల‌కు మ‌ద్ద‌తుగా హైద‌రాబాద్ మ‌హిళ‌లు !

Published : Feb 14, 2022, 05:25 PM IST
hijab row: క‌ర్నాట‌క హిజాబ్ విద్యార్థుల‌కు మ‌ద్ద‌తుగా హైద‌రాబాద్ మ‌హిళ‌లు !

సారాంశం

Karnataka hijab row: కర్నాట‌క‌లోని ప‌లు విద్యాసంస్థ‌ల్లో రాజుకున్న హిజాబ్  (Hijab) వివాదం.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ దుమారం రేపుతున్న‌ది. అయితే, హిజాబ్ ధ‌రిస్తామ‌ని చెబుతున్న విద్యార్థుల‌కు  మ‌ద్ద‌తుగా హైద‌రాబాద్ లో ప‌లువురు మ‌హిళ‌లు ఎన్టీఆర్ ఆర్డెస్ స‌మీపంలో ప్ల‌కార్డులను ప్ర‌దర్శించారు.   

Karnataka hijab row: కర్నాట‌క‌లోని ప‌లు విద్యాసంస్థ‌ల్లో రాజుకున్న హిజాబ్  (Hijab) వివాదం.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ దుమారం రేపుతున్న‌ది. అయితే, హిజాబ్ ధ‌రిస్తామ‌ని చెబుతున్న విద్యార్థుల‌కు  మ‌ద్ద‌తుగా హైద‌రాబాద్ లో ప‌లువురు మ‌హిళ‌లు ఎన్టీఆర్ గార్డెస్ స‌మీపంలో ప్ల‌కార్డులను ప్ర‌దర్శించారు. వివ‌రాల్లోకెళ్తే.. ఖైరతాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర పలువురు మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కర్నాటక విద్యార్థులకు మద్దతుగా గృహిణులు, కార్యకర్తలు, న్యాయవాదులు, చిన్నపిల్లలు ప్ల‌కార్డుల‌తో నిలబడి నిరసన తెలిపారు. ఈ నిరసనల‌కు న్యాయవాది అఫ్సర్ జహాన్ నాయకత్వం వహించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఇది నిరసన కాదు. ఇది సంఘీభావం ఒక రూపం. ఇది మా ఆందోళన, మా ప్రాథమిక హక్కులు, మా బాధ, మా అవసరాన్ని అర్థం చేసుకోవాలని ప్రభుత్వానికి,  న్యాయస్థానానికి విజ్ఞప్తి.. అభ్యర్థన. రాజ్యాంగ హక్కులు, రాష్ట్ర నిర్మిత చట్టాల మధ్య ఘర్షణ ఉన్నందున మొత్తం గందరగోళం ఏర్పడింది. ఇలాంటి వాటి మధ్య ఘర్షణ జరిగినప్పుడల్లా, ఏ చట్టంపై ఏ చట్టం అమలులో ఉంటుందో నిర్ణయించేది న్యాయస్థానం. కాబట్టి మన ప్రాథమిక హక్కును కాలరాయడం లేదా అడ్డంకులు ఏర్పడితే, ఏది ప్రబలమో నిర్ణయించే అధికారం కోర్టుకు ఉంది. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకోవాలని కోర్టును అభ్యర్థిస్తున్నాం. మేమంతా కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం” అని తెలిపారు.   

ముస్లిం మహిళలకు సంఘీభావంగా నిలబడిన నగర కార్యకర్త షీలా సారా మాథ్యూస్ మాట్లాడుతూ.. “ఈ రోజు మేము కర్నాటకలోని మా హిజాబీ సోదరీమణులతో, వారి విద్య, వారి మతాన్ని ఎంచుకోవడానికి ఒత్తిడికి గురవుతున్న వారితో నలిబడి ఉన్నాం. రాజ్యాంగం మనకు అందించిన “మత స్వేచ్ఛ” ఇది మా ప్రాథమిక హక్కు అని మేము విశ్వసిస్తున్నందున మేము ఇక్కడ మద్దతుగా నిలబడి ఉన్నాము” అని అన్నారు. “మత చిహ్నం లేదని మీరు చెబుతుంటే, మీరు సిక్కుల పగ్రీ (తలపాగా) తీయమని చెప్పబోతున్నారా? ఇది ఎక్కడ ఆగబోతోంది? మీరు ఒక సంఘాన్ని లక్ష్యంగా చేసుకోలేరు. ఇది మన రాజ్యాంగానికి సంబంధించిన మతపరమైన అంశం మాత్రమే కాదు. గత కొన్నేళ్లుగా నిరంతరం దాడికి గురవుతున్న మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు పోరాడుతున్నాం' అని ఆమె తెలిపారు.మరో నిరసనకారుడు అజ్మత్  మాట్లాడుతూ.. “నా మతం, రాజ్యాంగం రెండూ నాకు నా మతంతో విద్యను పొందే హక్కును ఇచ్చాయి. కాబట్టి వారు నా హిజాబ్‌ను తీసివేయమని ఎలా అడుగుతారు? వారు హిందూ ముస్లింలు, సిక్కు సమాజం మధ్య ఘర్షణను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది అనుమ‌తించ‌డానికి వీలులేనిది” అని తెలిపారు. 

 

కాగా, ముస్లిం బాలికలు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు విద్యార్థులు నిరసన వ్యక్తం చేసిన తర్వాత కొన్ని వారాల క్రితం క‌ర్నాట‌క‌లో  హిజాబ్  అంశం ఉద్రిక్త‌ల‌కు దారితీసింది. ఆ తర్వాత రాష్ట్ర పరిపాలన కళాశాలలు, పాఠశాలల్లో మతపరమైన దుస్తులు ధరించరాదని నిబంధనను జారీ చేసింది. ప్ర‌స్తుతం హిజాబ్ వ్య‌వ‌హారాన్ని క‌ర్నాట‌క హైకోర్టు విచార‌ణ జ‌రుపుతోంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేప‌థ్యంలో కర్నాట‌క‌లో మూత‌ప‌డిన విద్యాసంస్థ‌లు సోమ‌వారం నుంచి తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే అత్యధిక ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించకుండా తరగతులకు హాజరైనప్పటికీ, శివమొగ్గ (Shivamogga) జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 13 మంది విద్యార్థులు ఎస్‌ఎస్‌ఎల్‌సీ (10వ తరగతి) ప్రిపరేటరీ పరీక్షకు హిజాబ్ తొల‌గించి.. హాజరు కావడానికి నిరాకరించారు. ప‌రీక్ష‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్నామ‌ని పేర్కొన్నారు.  హిజాబ్ ధ‌రించిన విద్యార్థుల‌ను విద్యాసంస్థ‌ల్లోకి అనుమ‌తించ‌డానికి ఆయా యాజ‌మాన్యాలు నిరాక‌రించాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu