రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో భూవివాదం.. బౌన్సర్లపై తిరబడిన మహిళా రైతులు..

Published : Jan 09, 2023, 05:28 PM IST
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో భూవివాదం.. బౌన్సర్లపై తిరబడిన మహిళా రైతులు..

సారాంశం

రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌‌ గ్రామంలో భూవివాదం ఉద్రిక్తతకు దారితీసింది. బౌన్సర్లపై మహిళా రైతులు తిరగబడ్డారు.

రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌‌ గ్రామంలో భూవివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలోని ఓ స్థలం విషయంలో వివాదం  కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి హైకోర్టులో కూడా కేసు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వివాదస్పద భూమిని చూసేందుకు రైతులకు మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేరుకున్నారు. అయితే ఆ సమయంలోనే అక్కడ ఉన్న బౌన్సర్‌‌లు రైతులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే మహిళా రైతులు బౌన్సర్లపై తిరగబడ్డారు. బౌన్సర్లను వెంటపడి అక్కడి నుంచి తరిమికొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్
Complaint Against YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు| Asianet News Telugu