హైదరాబాద్‌లో షాకింగ్ సీన్.. దుర్గా మాతా చెప్పిందంటూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ..

Published : Apr 11, 2023, 11:15 AM ISTUpdated : Apr 11, 2023, 02:40 PM IST
 హైదరాబాద్‌లో షాకింగ్ సీన్.. దుర్గా మాతా చెప్పిందంటూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ..

సారాంశం

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. రాజేంద్ర నగర్ పరిధి అత్తాపూర్‌లో ఓ మహిళపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. 

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. రాజేంద్ర నగర్ పరిధి అత్తాపూర్‌లో ఓ మహిళ తనకు తానే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. మంగళవారం ఉదయం ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చిన మహిళా పెట్రోల్ పోసుకుంది. అత్తాపూర్‌ రహదారిపై పిల్లరు నెంబర్ 133 వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కాలిపోయిన మహిళ రోడ్డుపై పడిపోయింది. మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. మహిళను అత్తాపూర్‌కు చెందిన శివానిగా గుర్తించారు. ఆమె బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శివానిని ఆస్పత్రికి తరలించారు. 

కలలో దుర్గా మాతా చెప్పిందంటూ శివాని ఆత్మహత్యకు యత్నించిందని పోలీసులు తెలిపారు. శివాని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చైనా మంజాను ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్ర‌మాదం ఎందుకు.?
Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?