ప్రియుడితో భార్య రాసలీలలు: గంటలోపే పైలోకాలకు అది చూసిన భర్త

By telugu teamFirst Published Jun 21, 2021, 8:26 AM IST
Highlights

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. రెండేళ్లుగా ఆమె మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. శనివారం వారిద్దరు కలిసి ఉండగా మహిళ భర్త చూశాడు. ఆ తర్వాత గంటలోపే శవమై తేలాడు.

ఖమ్మం: రెండేళ్లుగా మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళ భర్త హత్యకు గురయ్యాడు. ప్రియుడితో కలిసి మహిళ తన భర్తను చంపేసింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో చోటు చేసుకుంది. 

హతుడు భాస్కర్ వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. భాస్కర్ కు జనార్దన్ అనే మిత్రుడు ఉన్నాడు. భాస్కర్ భార్యతో గత రెండేళ్లుగా జనార్దన్ అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి జనార్దన్ ను పలుమార్లు హెచ్చరించారు కూడా. 

కొద్ది రోజులు భాస్కర్ భార్య రాధమ్మకు దూరంగా ఉన్న జనార్దన్ మళ్లీ ఆమెతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. శనివారం రాత్రి ఇంట్లో బార్య రాధమ్మ, ఆమె ప్రియుడు రాసలీలల్లో మునిగి ఉండా భాస్కర్ చూశాడు. ఆ తర్వాత గంటకు అతను శవమై తేలాడు 

ప్రియుడితో కలిసి పథకం ప్రకారం రాధమ్మ తన భర్తను హత్య చేయించిందని మృతుని బంధువులు ఆరోపించారు. భాస్కర్ మృతదేహంతో అతని బంధువులు జనార్దన్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో భాస్కర్ బంధువులు ఆందోళన విరమించారు. 

click me!