కరీంనగర్ కార్పొరేటర్ కంటతడి.. ఎందుకంటే ?

Published : Sep 11, 2017, 06:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
కరీంనగర్ కార్పొరేటర్ కంటతడి.. ఎందుకంటే ?

సారాంశం

ఎమ్మెల్యే గంగులపై కార్పొరేటర్ విమర్శలు తన డివిజన్ లో అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని విమర్శ రాజీనామా లేఖ పంపిన జయశ్రీ

కరీంనగర్ టిఆర్ఎస్ లో కొత్త చిచ్చు రాజుకున్నది. కరీంనగర్ కార్పొరేషన్ లోని 30వ వార్డు సభ్యురాలు జయశ్రీ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తున్న సందర్భంలో ఆమె కంటతడి పెట్టారు. ఇంతకూ ఆమెకు వచ్చిన కష్టాలేంటని జనాల్లో చర్చ జరుగుతున్నది. ఆమె కష్టాలపై అందిస్తున్న స్టోరీ ఇది. చదవండి.

కరీంనగర్ లో 30వ వార్డులో జయశ్రీ అనే మహిళ భారీ మెజార్టీతో జయశ్రీ గెలుపొందారు. అయితే ఆమె డివిజన్ లో తన మీదే ఓడిపోయిన అభ్యర్థికి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రోత్సహిస్తూ తనను చిన్నచూపు చూస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది.

తన డివిజన్ ను దత్తత తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ ను ఆమె కోరింది. ఒక సభలో ఆమె విన్నపాన్ని స్వీకరించిన మంత్రి ఈటల తాను 30వ డివిజన్ ను దత్తత తీసుకునేందుకు అంగీకరించారు. అనంతరం ఆ డివిజన్ కు 5కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం మంత్రి మంజూరు చేసినా ఎమ్మెల్యే అడ్డుతగిలి వాటిని రిలీజ్ కాకుండా చేశాడని ఆరోపించారు. గడిచిన మూడేళ్ల కాలంగా తనను వేధిస్తున్నారని ఆమె కంటతడి పెట్టారు. కేవలం ఎమ్మెల్యే వైఖరి కారణంగానే తాను ఇబ్బందులకు గువుతున్నానని చెప్పారు.

తాను రాత్రికి రాత్రే నామినేటెడ్ పదవిని స్వీకరించిన వ్యక్తిని కాదని జయశ్రీ చెప్పారు. తన భర్త కష్టపడి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకుంటేనే గెలిచానని గుర్తు చేశారు. పిచ్చుక లాంటి తన మీద అంత పెద్ద స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎందుకు బ్రహ్మాస్త్రం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా డివిజన్ లో నన్ను గెలిపించిన ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నానని, ఎమ్మెల్యే అడ్డుపడడం వల్ల ఎలాంటి అభివృద్ధి చేయలేకపోతున్నానని ఆమె చెప్పారు. అందుకే తన రాజీనామాను ఎంపి, మంత్రి, సిఎం ఆఫీసుకు పంపినట్లు చెప్పారు.

మొత్తానికి కరీంనగర్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మరి ఈ వివాదాన్ని అధికార పార్టీ పెద్దలు ఎలా పరిస్కరిస్తారో అన్న చర్చ ఇంకా సాగుతోంది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా