తెలంగాణ‌లో కుల గ‌ణ‌న చేప‌డ‌తాం.. కేసీఆర్ పై రాహుల్ గాంధీ ఫైర్

Published : Oct 20, 2023, 04:11 AM IST
తెలంగాణ‌లో కుల గ‌ణ‌న చేప‌డ‌తాం.. కేసీఆర్ పై రాహుల్ గాంధీ ఫైర్

సారాంశం

Telangana Assembly Elections 2023: తెలంగాణలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో కుల గణన చేప‌డ‌తామ‌ని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ అన్నారు. సింగ‌రేణి కార్మికుల‌తో స‌మావేశ‌మైన త‌ర్వాత మాట్లాడుతూ..రాష్ట్ర ఎన్నికలలో గెలిచిన అనంతరం.. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపులు మంజూరు చేస్తామనీ, సింగరేణి గనుల అభివృద్ధికి తోడ్పడతామ‌ని చెప్పారు. ఇదే క్ర‌మంలో బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు.   

AICC leader Rahul Gandhi on caste census : తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోతోందని ఏఐసీసీ అధినేత రాహుల్‌ గాంధీ గురువారం అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో కుల గణన చేప‌డ‌తామ‌ని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ అన్నారు. సింగ‌రేణి కార్మికుల‌తో స‌మావేశ‌మైన త‌ర్వాత మాట్లాడుతూ..రాష్ట్ర ఎన్నికలలో గెలిచిన తర్వాత‌.. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపులు మంజూరు చేస్తామనీ, సింగరేణి గనుల అభివృద్ధికి తోడ్పడతామ‌ని చెప్పారు. ఇదే క్ర‌మంలో బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 'విజయభేరి' యాత్రలో భూపాలపల్లి నుంచి పెద్దపల్లి వెళ్లే మార్గంలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద సమస్యగా కుల గణనను అభివర్ణిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మౌనం వహించడాన్ని ప్రశ్నించారు. దేశంలో వెనుకబడిన తరగతుల జనాభా కేవలం ఐదు శాతమే ఉందో లేదో తేల్చే కుల గణన ఎక్స్‌రేలా ఉంటుందన్నారు. ''భారత బడ్జెట్‌లో కేవలం ఐదు శాతం మాత్రమే ఓబీసీల నియంత్రణలో ఉంది. దేశంలో ఓబీసీ జనాభా కేవలం ఐదు శాతం మాత్రమేనా? అని నేను అడగాలనుకుంటున్నాన‌ని" ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, కర్నాటకలో కుల గణనకు పార్టీ ఇప్పటికే ఆదేశించిందని కాంగ్రెస్‌ నేత చెప్పారు. “తెలంగాణలో మా పార్టీ అధికారంలోకి వస్తే, ఇక్కడ మేము చేసే మొదటి పని తెలంగాణ ఎక్స్‌రేలా నిలిచే కుల‌గ‌ణ‌న‌” అని ఆయన అన్నారు. అలాగే, కాంగ్రెస్ పేదలు, రైతులు, కార్మికుల ప్రభుత్వాన్ని అందజేస్తుందని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల పోరు దొరల (భూస్వామ్య ప్రభువులు) తెలంగాణ‌, ప్రజల తెలంగాణ మధ్య జ‌రిగే పోరుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. "వ‌చ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతారని భావిస్తున్నాను. ఇది దొరల తెలంగాణ, ప్రజా తెలంగాణ మధ్య పోరు... రాజు, ప్రజాల మధ్య పోరు" అని ఆయన అన్నారు. కేసీఆర్ పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడిన రాహుల్ గాంధీ పదేళ్ల తర్వాత కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజలకు దూరమవుతూనే ఉన్నారన్నారు.

తెలంగాణలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించిన రాహుల్.. రాష్ట్రంలోని నియంత్రణలన్నీ ఒకే కుటుంబంపై ఉన్నాయని కేసీఆర్‌ను ఉద్దేశించి విమ‌ర్శ‌లు గుప్పించారు. విపక్ష నేతలందరిపై బీజేపీ దాడులు చేస్తుందని, ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలను ఉపయోగించి కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...